Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ముఖ్యనాయకుల భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఆయా నియోజకవర్గాల నుంచి టికెటు ఆశిస్తున్న అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఈమేరకు మంగళవారం సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి నివాసంలో ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, నాగార్జునసాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలపై చర్చించారు. ఒక్కొక్క ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ముగ్గురి చొప్పున పేర్లను ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఈ జాబితాను అధిష్టానానికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి బోసు రాజ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.