Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్త సాగు చట్టాలు దేశానికి ప్రమాదకరమనీ, వాటిని రద్దు చేయాలని కాంగ్రెస్పార్టీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా క్రుడాయిల్ ధరలు తగ్గుతున్నా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించింది. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ను ముట్టడించింది. లుంబినీ పార్కు నుంచి రాజ్భవన్కు ప్రదర్శనగా వెళ్లేందుకు తెలుగుతల్లి విగ్రహం వద్దకు
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అప్పటికే భారీగా పోలీసులు మొహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. రాజ్భవన్కు పోయేందుకు అనుమతి లేదంటూ నాయకులను అరెస్టు చేశారు. వారందరినీ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కొంత మంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. అరెస్టయిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎనుముల రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధుయాష్కీగౌడ్, జి చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి,మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవి, ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మెన్ కత్తి వెంకటస్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్, కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్ ప్రీతమ్, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షలు సోహైల్ ఉన్నారు.
ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం ఎందుకు? : ఉత్తమ్
అంతర్జాతీయంగా క్రూడాయిల్ తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ చేయలేకపోతున్నదని పీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో యాసంగి నుంచి ధాన్యం కొనుగోలు చేయమని కేసీఆర్ అంటున్నారనీ, ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని చెప్పారు. సాగర్లో బీజేపీకి పరాభవం తప్పదని హెచ్చ రించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మూడు నల్ల చట్టాలతో బీజేపీ ప్రభుత్వం రైతు జీవితాలపై మరణ శాసనం రాస్తున్నదని ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శిం చారు. ఆదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నదన్నారు.