Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్రేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రదేశాల్లో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పింది. ఇదిలా ఉండగా పలు జిల్లాలో చలి తీవ్ర కొనసాగుతున్నది. గత 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా కోహిర్లో 11.3 డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రత ఉండగా, అలాగే పలు జిల్లాలో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.