Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రెస్అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. 3.56 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటివరకు 1640 మంది పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు రూ. 20వేల చొప్పున రూ. 3.28 కోట్లను, హౌం క్వారంటైన్ లో 87 మంది జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున రూ. 8. 70 లక్షల సాయమందించినట్టు వివరించారు. కరోనా బారిన పడ్డ వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు మరో 200 మంది జర్నలిస్టులకు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో..మీడియా అకాడమీకీ ఆర్థిక పరమైన వొత్తిడి వల్ల వీరికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని సంక్షేమ నిధి నుంచి వచ్చిన వడ్డీ ద్వారా రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనం రూ.34.50 కోట్ల నుంచి వచ్చిన వడ్డీతో మాత్రమే ఈ కార్యకలాపాలను నిర్వహించామని బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.