Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలి: ఉద్యోగ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ వి మమత, టీఎన్జీవో, టీజీవో ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, ఎ సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను బుధవారం వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ వారంలోనే మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీపై ఈనెల రెండో వారంలోనే చర్చలు జరపాలని ఆదేశాలున్నా ఉద్యోగ సంఘాలను పిలవలేదని తెలిపారు. త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను బహిర్గతపరిచి ఉద్యోగ సంఘాలకు ఆ ప్రతులను అందించాలని సూచించారు.