Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒకవేళ సీఎం పదవి నుంచి తప్పుకుంటే మంత్రి ఈటల రాజేందర్నైనా, దళితుడినైనా సీఎంగా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నుంచి అవినీతి మచ్చలేని ఎమ్మెల్యేలు ముందుకొస్తే బీజేపీలో చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకర్లతో చిట్చాట్ నిర్వహించారు. కేటీఆర్ను సీఎం చేయాలని ప్రగతిభవన్లో టీవీలు పగులుతున్నాయని ఎద్దేవా చేశారు. తన కొడుకు కేటీఆర్ను సీఎంగా చేసేందుకే ఇంట్లో పూజలు, కాళేశ్వరం యాత్రలు అని చెప్పారు. కేసీఆర్ తాను కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఈటల రాజేందర్ను ముందుపెట్టి నెగ్గుకొచ్చారనీ, ఈటలకు, హరీశ్రావుకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.