Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంపై పొన్నాల విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావుపై ప్రేమతో కాదనీ, బీజేపీ ఒత్తిడికి తలొగ్గే కేసీఆర్ సీఎం పదవి వదులుకోవడానికి సిద్ధమయ్యారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. దిగిపోయాక కూడా కేసులతో బీజేపీ వేధిస్తే...సానుభూతి పొందాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. భూముల అన్యాక్రాంతంపై సీఎం మౌనం వీడాలని డిమాండ్ చేశారు. విషయాలు దాచి పెట్టి కబ్జాకోరులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారు కాబట్టే కేసీఆర్ మీడియాతో మాట్లాడటం లేదన్నారు. పూజల పేరుతో దేవుళ్లను ఆయన మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం : ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
కృష్ణా జలాల్లో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చెప్పారు. అయినా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను జగన్కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లోనూ లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు.