Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2018, జులై ఒకటి నుంచి 60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, త్రిసభ్య కమిటీ సభ్యులకు మెయిల్ ద్వారా బుధవారం ఆయన లేఖ రాశారు. తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు 30 నెలలుగా పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని సూచించారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.