Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షు లుగా బెల్లం శ్రీనివాసరావు (తిరుమ లాయపాలెం జెడ్పీటీసీ, ఖమ్మం), ప్రధాన కార్యదర్శిగా భరత్ ప్రసాద్(కల్వకుర్తి జెడ్పీటీసీ, నాగర్కర్నూల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నాడు జడ్పీటీసీల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బొట్టు సుధారాణి(జగిత్యాల), ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్(శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా), కార్యదర్శిగా తోటకూర అనురాధ(యాదగిరిగుట్ట) నియమితులయ్యారు. అనంతరం మీడియాతో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికై రెండేండ్లు గడుస్తున్నా అధికారాలు, అభివృద్ధి కార్యక్రమాలు లేక జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో జెడ్పీటీసీలు తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక కుమిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి హక్కులు సాధించుకోవాలన్నారు. గ్రామాల్లో పర్యటన చేసేందుకు జెడ్పీటీసీలకు వాహనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ జెడ్పీటీసీలకు ప్రతి యేటా రూ.50 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ లో జడ్పీ స్థాయి సంఘాలు ఏర్పాటు చేయా లని కోరారు. ఆగస్టు 15న జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ అవకాశం కల్పిచాలని కోరారు.కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షులు నరేందర్, మాజీ ఎమ్మెల్యే కె.నగేష్, ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్దార్థ, శ్రీశైలం పాల్గొన్నారు.