Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈనెల 26న జరిగే గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. వేడుకలు జరిగే పబ్లిక్గార్డెన్స్లో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. అలాగే భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, బ్యారికేడ్ల ఏర్పాటు తప్పనిసరి చెప్పారు. ఈసందర్భంగా సీఎస్ వెంట జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, అదనపు డీజీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, కలెక్టర్ శ్వేతామహంతి తదితరులు ఉన్నారు.