Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ కలెక్టరేట్ ఎదుట వీఆర్వోల నిరసన
నవతెలంగాణ - నల్లగొండ
తమకు భూ సంబంధ పనులు అప్పజెప్పొద్దని కోరుతూ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఓలు బుధవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భూసంబంధ పనులు చేయాలని తహసీల్దార్లు తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీని వల్ల తాము మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకెళ్లినప్పుడు జనం తమతో గొడవలకు వస్తున్నారని, తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. 12 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తమకు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. అర్హులైన వారిని సర్వే ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. తమను ఇతర శాఖలకు కాకుండా రెవెన్యూ శాఖలోనే ఉంచాలని కోరారు. వయోభారం పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వీఆర్ఎస్ ఇచ్చే విధంగా చూడాలని, అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు పాగిల వెంకటయ్య, అసోసియేట్ అధ్యక్షులు జిల్లా వెంకటయ్య, కార్యదర్శి నజీర్, జిల్లా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.