Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ప్రగాఢ సంతాపం
నవతెలంగాణ-నారాయణగూడ
విజయవాడ కేంద్రంగా ప్రజాశక్తి దినపత్రికలో విధులు నిర్వహిస్తున్న ఫొటో జర్నలిస్ట్ కె.అరుణ్ కుమార్(40) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి బుధ వారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. తోటి జర్నలిస్టులతో కలసిమెలిసి నిబద్ధతతో పని చేసే అరుణ్ కుమార్ అకాల మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. చిన్న వయసులో అరుణ్ కుమార్ మరణం ఫొటో జర్నలిజంకు తీరని లోటన్నాని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.