Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెత్తసేకరణ కార్మికుల సమస్యపై చర్చ సందర్భంగా ఘటన
నవతెలంగాణ-బోడుప్పల్
అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మంత్రి మల్లారెడ్డి ముందే బాహాబాహీకి దిగారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధి పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కార్మికుల ఆందోళనపై బుధవారం కార్యాలయంలో మంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించారు. మేయర్ జక్కా వెంకట్రెడ్డి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యామ్సన్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు కార్మికుల సమస్యపై చర్చిస్తుండగా వివాదం ఏర్పడింది. ఇన్ని రోజులు అంతర్గతంగా ఉన్న టీఆర్ఎస్లోని విభేదాలు బయటపడ్డాయి. సభ్యులు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. పరిస్థితి అదనపు తప్పుతుండగా మంత్రి మల్లారెడ్డి కల్పించుకొని సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికులకే చెత్త సేకరణ బాధ్యత
కార్పొరేషన్లో కమర్షియల్ చెత్త సేకరణ బాధ్యత మళ్లీ రోజువారీగా చెత్త సేకరణ చేసే కార్మికులకే అప్పగిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. పాలకవర్గం సభ్యులు, అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ పీర్జాదిగూడ కార్పొరేషన్ అధ్యక్షుడు దర్గ దయాకర్రెడ్డి అన్నారు.