Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాన్ని(ఎన్సీడీసీ) హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో అనుమతించిందనీ, ఆ కేంద్రం ఏర్పాటుకు వెంటనే స్థలాన్ని కేటాయించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. '2019లోనే ఎన్సీడీసీ అనుమతించింది. నిధులు కూడా విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్థలం కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ అధికారులు మూడెకరాల భూమి కావాలని అడిగి ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎన్సీడీసీ హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఉంటే కరోనాపై పోరాటానికి మరింతగా ఉపయోగపడేది. కేంద్ర మంత్రితో మాట్లాడి ఎన్సీడీసీ హైదరాబాద్కు తీసుకొచ్చా. మీరు స్థలం కేటాయిస్తే వెంటనే ఎన్సీడీసీ ఏర్పాటుకు బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పటికైనా స్థలం కేటాయించేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలి' అని లేఖలో పేర్కొన్నారు.