Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు విడుదల చేయనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ సంస్థ నుంచి నూతనంగా ఐస్క్రీమ్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు విజయ డెయిరీ చైర్మెన్ లోక భూమారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. విజయ పేరుతో కుల్ఫీ, చాకోబార్, అమెరికానో, బెల్జియన్ డార్క్ చాకొలేట్, ఫ్రెంచ్ వెనీలా, తదితర 30 రకాల ఫ్లేవర్లలో ఐస్క్రీమ్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల విజయ డెయిరీ లాభాల బాటలో నడుస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 362 ఔట్ లెట్ల ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించామని పేర్కొన్నారు.