Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహరావు నివసించిన వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివద్ది చేయటానికి సుమారు రూ. 11 కోట్ల ప్రతిపాదనలతో పీవీ విజ్ఞాన వేదిక డిజైన్లను రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దివంగత, మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంతి వేడుకలలో భాగంగా ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే అశయంతో ఆయన పేరిట పీవీ విజ్ఞాన వేదికను వంగర గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు.మాజీ భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మతివనం తరహాలో పీవీ విజ్ఞాన వేదిక ను తీర్చిదిద్దుతున్నామన్నామని చెప్పారు. రాష్ట్రం గర్వించే వ్యక్తిగా పట్వారీ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన పీవీ ప్రతి ఒక్కరికీ స్పూర్తిప్రధాతగా నిలిచారన్నారు. పీవీ నివసించిన ఇంటిని మ్యూజియంగా, వంగర గ్రామంలో పీవీ పేరుతో సుమారు 8 ఎకరాలలో పీవీ విజ్ఞాన వేదిక ను రూపోందిస్తున్నామన్నారు.అందుకు మొదటి దశలో రూ. 7 కోట్లు, పీవీ విజ్ఞాన వేదిక లో విగ్రహానికి ఫౌంటైన్, లైటింగ్, ఆయన విజయాలు , పోటో గ్యాలరీ, మెడిటేషన్ సెంటర్, సైన్స్ మ్యూజియం, మేజ్ గార్డెన్, పిల్లల ఆట స్థలాలు, స్వాతంత్ర సమరయోధుల శిల్పాలు, యాంఫి థియేటర్, ఫుడ్ కోర్టుల నిర్మాణానికి 686.25 లక్షల రూపాయలను కేటాయించామన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 1098.45 లక్షలతో వంగరలో పీవీ విజ్ఞాన వేదికను నిర్మిస్తున్నామన్నారు.