Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం మరోసారి డెడ్లైన్ విధించడం అన్యాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. హైదరాబాద్లో ఆమె సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. రూ.60 వేల కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 6వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు డిజైన్ మార్చడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరగుతున్నదన్నారు. ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్లో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. కమీషన్ల కక్కుర్తితోనే అండర్ గ్రౌండ్ పంప్హౌస్ నిర్మాణానికి మక్కువ చూపుతున్నారని విమర్శించారు.