Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 యూనియన్లకు అవకాశం
- పీఆర్సీపై త్రిసభ్య కమిటీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేతన సవరణకు సంబంధించి బుధవారం ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలతో భేటీ కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారమేదీ లేనప్పటికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయాసంఘాలకు ఆహ్వానంపంపే అవకాశ ముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎనిమిది ఉపాధ్యాయ సంఘాలతోపాటు టీఎన్జీవోలు, టీజీవోలు, రెవెన్యూ, సచివాల య ఉద్యోగులు, డ్రైవర్లు, నాలుగో తరగతి ఉద్యోగులకు సం బంధించిన యూనియన్లు, అసోసియేషన్లను భేటీకి ఆహ్వా నించే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నిర్వహించిన త్రిసభ్య కమిటీలో నిర్ణయిం చినట్టు సమాచారం. సమావేశంలో సీఎస్తోపాటు కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ పాల్గొన్నారు.