Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్వోలకు రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని టీవీఆర్వోడబ్ల్యూఏ సంఘం నేతలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ను కోరారు. ఈ మేరకు ఆయనకు టీవీఆర్వోడబ్ల్యూఏ ప్రతినిధుల బృందం వినతిపత్రాన్ని సోమవారం అందజేసింది. వినోద్కుమార్ను కలిసిన వారిలో ఆ సంఘం అధ్యక్షులు గరికె ఉపేందర్రావు, కోశాధికారి కోనబోయిన ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.నరేంద్రప్రసాద్, రాష్ట్ర నాయకులు సత్యం, మురళి, బాలకృష్ణ, ప్రకాశ్రావు, తదితరులున్నారు.
జీవో నెంబర్ 514 ప్రకారం జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోలలో 60:40 శాతం పద్ధతిలో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉందన్నారు. అయితే, కేవలం జూనియర్ అసిస్టెంట్లకే పదోన్నతులు కల్పిస్తూ వీఆర్వోలను పక్కనబెట్టారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లారు. దీనవల్ల వీర్వోలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని వాపోయారు. 22 ఏండ్లుగా వీఆర్వో బాధ్యతలు నిర్వహించినవారికి కూడా పదోన్నతులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లు పదోన్నతి కల్పించేలా సీఎం కేసీఆర్పై ఒత్తిడి చేయాలని కోరారు.