Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహీంద్ర విశ్వవిద్యాలయం అకడమిక్ డీన్ ప్రొఫెసర్ బిష్ణుపాల్కు అంతర్జాతీయ అవార్డు లభించింది. సొసైటీ ఆఫ్ ఫొటో ఆప్టికల్స్ ఇన్స్ట్రూమెంటేషన్ ఇంజినీర్స్ నుంచి ది-2021, జె వైజుల్ ఎడ్యుకేటర్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఆప్టిక్స్ విద్యాబోధనలో సేవలతోపాటు విద్యాబోధన, పరిశోధనలు, ఆప్టిక్స్, ఫొటోనిక్స్ ప్రచురణలకు సంబంధించి చేసిన కృషికి ఈ గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనను వర్సిటీ వీసీ యజులు మెడురె అభినందించారు.