Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురి హత్య | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురి హత్య

Tue 26 Jan 04:21:39.197472 2021

- నల్లగొండలో ఇద్దరు.. తుర్కపల్లిలో రైతు..
నవతెలంగాణ-నల్లగొండ/తుర్కపల్లి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. నల్లగొండ పట్టణ కేంద్రంలో ఇద్దరు, తుర్కపల్లి మండలంలో ఒకరి హత్య జరిగింది. నల్లగొండ టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింహులుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్‌ రాంనగర్‌ పార్క్‌ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. అక్కడ ఉన్న మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఇతర రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల వయస్సు 35-40 మధ్య ఉంటుంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్‌లో పొలానికి నీళ్లు ఇవ్వలేదని రైతును చంపేశారు. ఏసీపీ నర్సింహారెడ్డి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌ గ్రామానికి చెందిన తూటి రామచంద్రయ్య (56)కు గ్రామ శివారులో రెండెకరాల భూమి ఉంది. ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహమ్మద్‌ ఇబ్రహీంకు రామచంద్రయ్య అన్నదమ్ములకు మధ్య భూవివాదం ఉండగా కొన్ని నెలల కిందట పరిష్కారం చేసుకున్నారు. అందులో ఇబ్రహీంకు ఎకరం భూమి వచ్చింది. ఆ భూమిలో వ్యవసాయం కోసం నీళ్లు లేకపోవడంతో రామచంద్రయ్య బోరు నుంచి పెట్టుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని రామచంద్రయ్యను అడిగాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రామచంద్రయ్య పొలం వద్ద ఉండగా, ఇబ్రహీం, అతని ఇద్దరు కొడుకులు ఇలియాస్‌, ఇంతియాజ్‌ మద్యం తీసుకుని వెళ్లి అక్కడ తాగారు. ఆ తర్వాత పొలానికి నీళ్లు అడిగారు. అయితే, తన పొలానికే సరిపోవడం లేదని రామచంద్రయ్య చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే సమయంలో కర్రతో రామచంద్రయ్య తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఏసీబీ నర్సింహారెడ్డి, సీఐ నరసింహ, ఎస్‌ఐ మహేష్‌ బాబు, క్లూస్‌ టీం సంఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుని తమ్ముడు తోటి సంజీవ.. తన అన్నను ఇలియాస, ఇంతియాజ్‌, ఇబ్రహీంలే హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియాస్పత్రికి తరలించారు. ఇబ్రహీంను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతని ఇద్దరు కొడుకులు పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానించాలి
15 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
ఆర్టీసీలో పెళ్లైన బ్రహ్మచారులు
విశాఖ ఉక్కుకు శఠగోపం
చట్టాలను రద్దు చేయకపోతే..
కొండపల్లి సీతారామయ్య జీవితచరిత్ర ఓ ప్రేరణ
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బర్తరఫ్‌ చేయాలి
గొలుసుకట్టు మోసం...
నాగేశ్వర్‌ ను గెలిపించుకుందాం
మార్క్సిజంతోనే సమానత్వం
భగీరథలో కాంట్రాక్టర్ల అక్రమ దందా
పోడు భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం
ఆ ఉత్తర్వులను ఎందుకు అమల్జేయలేదు..?
దళిత పాలేరుపై పటేలు దాష్టీకం...
భారీగా బ్యాలెట్‌ పత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు
శ్రీశైలం 'స్పెషల్‌' బాదుడు
18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌
మధ్యాహ్న భోజనం బంద్‌
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో..
మెదక్‌ ఐసీడీఎస్‌ పరిధిలో వేధింపులు
టీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పండి
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ
ఐదుగురు జేడీలకు ఏడీలుగా పదోన్నతి
విద్యుత్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గాంబో నాగరాజు సస్పెన్షన్‌
గ్రామైక్య సంఘానికీ, రెండు ఎస్‌హెచ్‌జీలకు కేంద్ర అవార్డులు
సింగరేణి అధికారులకు ప్రత్యేక పెన్షన్‌ పథకం
37,658 మందికి మందికి వ్యాక్సిన్‌
'ట్రిబ్యునళ్ల తీర్పుల వివరాలు పంపండి'
పథకాల పురోగతి పట్ల కేంద్రం సంతృప్తి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.