Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకే ప్రయోజనమనే ప్రధాని ప్రచారం మోసపూరితం : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడు వ్యవసాయ చట్టాలు రైతులు, దేశానికి తీవ్ర నష్టదాయకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రైతులకే ప్రయోజనకరమనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రచారం మోసపూరితమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు నష్టం చేసి కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించే నల్లచట్టాలను మోడీ ప్రభుత్వం వారి మీద రుద్దాలని చూస్తున్నదని విమర్శించారు. దేశవ్యాప్తంగా 88 రోజుల నుంచి చట్టాల ఉపసంహరణకు, ఎంఎస్పీ చట్టం చేయాలని రైతులు ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ సమావేశంలో ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రకటన చేయ డం శోచనీయమని తెలిపారు. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలు మానకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు రైతులకు ఏ విధంగా నష్టం కలగచేస్తాయో 11సార్ల వ్యవసాయ మంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో రైతుసంఘాల నేతలు స్పష్టం చేశారని వివరించారు. ఇప్పటికీ వందల సంఖ్యలో మహాపంచాయతీలు నిర్వహించి అనేక వేదికలలో ప్రకటించారని గుర్తు చేశారు. సామాన్య రైతుకూ ఈ చట్టాల వల్ల నష్టాలు అర్థమవుతున్నా యని తెలిపారు. కేరళ అసెంబ్లీలో ఉన్న ఒక్క బీజేపీ ఎమ్మెల్యే సైతం ఈ చట్టాల రద్దును బలపర్చారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని వివరించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచి నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు కారణమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు రంగాన్ని స్వయంగా ప్రధాని ప్రోత్సహించడం అత్యంత దుర దృష్టకరమని విమర్శించారు. రైతాంగ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా మద్దతు లభిస్తున్న దనీ, ప్రజాస్వామ్య పద్ధతులను కాలరాస్తూ మోడీ నిరంకుశంగా వ్యవహరించడం ప్రజలు అంగీకరిం చరని తెలిపారు. ఈ చట్టాల రద్దు, వ్యవసాయరంగ రక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.