Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
- బయోఏషియా-2021 సదస్సు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఎదురులేదన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తున్నదన్నారు. సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జినోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్, బీ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా -2021 సదస్సును బేగంపేట ఐటీసీ కాకతీయలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఫార్మా రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవ శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలపై ఉపన్యాసాలు వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచం నలు మూలల
నుంచి 30 వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ కష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డులను మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు.
హైదరాబాద్ నుంచే 65 శాతం వ్యాక్సిన్లు : కృష్ణ ఎల్ల
ఈ అవార్డు తన ఒక్కనిది కాదు అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకాలు రావాలన్నారు.