Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్కు ఆయన మంగళవారం లేఖ రాశారు. ఐటీఐఆర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వహించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైల్వే, ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసినట్టయితే ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం కొనసాగించేదని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ నేతలు రోజుకో ఉత్తరం రాయటం సరిగాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.