Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. మోడీ ప్రభుత్వం తిరోగమన విధానాలను అవలంబిస్తున్నదనీ, ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నదని విమర్శించారు. పోస్కో సంస్థకు అతితక్కువ ధర రూ.5,500 కోట్లకు అప్పగించేందుకు సిద్ధపడుతున్నదని తెలిపారు. మార్కెట్ ధరను పరిశీలిస్తే రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధానమంత్రి మోడీపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వరంగంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ కొనసాగించేందుకు కృషి చేయాలని కోరారు. నష్టాల్లో నుంచి బయటపడేందుకు వీలుగా క్యాప్టివ్ మైన్ను కేటాయించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.