Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీటీఏ అధ్యక్షులు కృష్ణుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాలని బీసీటీఏ అధ్యక్షులు కె కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్గౌడ్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన బీసీటీఏ రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. కేజీ టు పీజీ వరకు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు. బీసీ ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. క్రీమీలేయర్ విధానాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 54 శాతానికి, ఎస్సీలకు 15 నుంచి 20 శాతానికి, ఎస్టీలకు 7 నుంచి 12 శాతానికి పెంచాలని కోరారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలకు హెడ్మాస్టర్ పోస్టును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2వేల స్కాలర్షిప్ అందించాలనీ, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని కోరారు.