Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎల్డీసీపై దాడికి యత్నం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (టీఎస్ఎల్డీసీ) కంప్యూటర్ సర్వర్ల పై చైనా హ్యాకర్లు దాడికి ప్రయత్నిస్తున్నారని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సిఈఆర్టీ) హెచ్చరించింది. దీనిపై టీఎస్ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు తక్షణం స్పందించారు. సైబర్దాడిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధింత ఐటీ విభాగం అధికారుల్ని ఆదేశించారు. సర్వర్ల ఐపీలను బ్లాక్ చేశారు. స్కాడా కంట్రోల్ సెంటర్ ద్వారా సర్వర్ల భద్రతను పర్యవేక్షిస్తున్నామనీ, గ్రిడ్ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు సీఎమ్డీ తెలిపారు.