Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
సికింద్రాబాద్ నుంచి దానా పూర్ వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇంజన్ నుంచి రైలు బోగీలు విడిపోయాయి. రైలు ఇంజన్ సుమారు 500 మీటర్ల దూరం ముందుకు వెళ్లిపోయింది. బోగీలు విడిపోయాయని గ్రహించిన లోకో పైలెట్లు ఇంజన్ను నిలిపి వేసి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో రైల్లో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు రైల్వే గేటులోనే రైలునిలిచింది. విడిపోయిన ఇంజన్ను బోగీలకు అనుసంధానం చేసిన అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లింది.