Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్లో నేరాలు, ఘోరాలకు అడ్డూ అదుపులేకుండా పోతు న్నదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు మంగళవారం కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, టి.స్కైలాబ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవి స్తున్న ఒక వ్యక్తి, బాధితురాలి తండ్రిని కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అరాచక పాలన నిందితులకు అండగా ఉన్న దుష్పలి తమే ఈహత్య జరిగిందనీ ఇది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం చేసిన హత్యేననిఅన్నారు. నిందితున్ని కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేశారు.