Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లోని 303 ప్రిన్సిపాల్ పోస్టుల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ముఖ్యకార్యదర్శి ఎ వాణీప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019, సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు. కోర్టు కేసుల్లో ఉన్న అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు చేపట్టామని వివరించారు. గురుకుల ప్రిన్సిపాల్ పోస్టులకు 187 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 4 నుంచి 5 వరకు రీలింక్విష్మెంట్ సౌకర్యం కల్పించామని సూచించారు.