Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ముద్ర రుణాల మంజూరులో బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన 68 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా, 40.9 లక్షల మందికే ఇచ్చారని అన్నారు.