Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్గా అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
- కమిటీలో పది మంది సభ్యులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనుషులు-జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం(హ్యుమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కమిటీ) తగ్గించే చర్యలు, సూచనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో పది మందితో కూడిన ఈ కమిటీకి చైర్మెన్గా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కన్వీనర్గా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్. శోభ వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేశ్రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ.శాంతి కుమారి, మాజీ ఎమ్మెల్యే జి. అరవింద్ రెడ్డి, ఈ.అనిల్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి), వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి రిటైర్డయిన నవీన్కుమార్, రాజీవ్ మాథ్యూ(ఎస్బీడబ్ల్యూఎల్ సౌత్జోన్-బెంగుళూరు), ఇమ్రాన్ సిద్ధిఖీ(హెచ్వైటీఐసీఓఎస్ కార్యదర్శి) ఉన్నారు. మనుషులు- వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం, ప్రస్తుత చర్యలు, నష్ట పరిహారంపై ఈ కమిటీ సమీక్షించనున్నది. జంతువుల దాడుల్లో మనుషులు గాయపడటం, చనిపోవటం, పెంపుడు జంతువుల మృతి, పంట నష్టం చర్యలపై అధ్యయనం చేయనున్నది.