Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్ఏఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్సుల భద్రత, వేతనాలకు సంబంధించి ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయాలని టీఎన్ఏఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేన్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రారు కె.జార్జ్, సెక్రెటరీ జనరల్ ఎవెలిన్ పి.కన్నన్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సుల రక్షణ, వేతనాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించామనీ, కోర్టు ఆదేశాలతో కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించిందని గుర్తుచేశారు.