Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంచ్ అవర్లో నిరసనలు:ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ప్రంట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడాన్ని, భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) విలువను వాటాలుగా విభజించి స్టాక్ మార్కెట్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా లిస్టింగ్ చేయాలనే కేంద్ర ప్రతిపాదనను నిరసిస్తూ ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్ బుధవారం ఎల్ఐసీ కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఆ సదస్సులో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పాల్గొంటారని తెలిపింది. ఈ నెల 18న ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎల్ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్ ఫ్రంట్లో భాగస్వామ్యంగా ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఎల్ఐసీ క్లాస్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ కార్యదర్శి నట్ట జ్వెన్స్, ఎన్ఎఫ్ఐఎఫ్డబ్ల్యూఐ జోనల్ రెసిడెంట్ సెక్రటరీ సి.చంద్రప్రకాశ్, ఎస్సీజెడ్ఐఈఎఫ్(ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి క్లెమెంట్దాస్, ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి పి.మహేశ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.