Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యాదాద్రి క్షేత్రాన్ని గురువారం సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ తుదిమెరుగుల పనులను వీక్షించనున్నారు. ఆర్టీసీ బస్ టెర్మినల్, డిపోలను నిర్మించనున్న స్థలాలు పరిశీలించే అవకాశం ఉంది. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం లక్ష్మీనసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తంను ఖరారు చేయనున్నట్టు 'యాడా' భావిస్తున్నది.