Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ బ్యాంక్-హైదరాబాద్ రీజియన్
హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన సీఈవో అండ్ ఎండీగా మటం వెంకట రావు నియమితుల య్యారు. తెలుగు వ్యక్తి అయిన ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉంటారు. ఆయన నాయకత్వంలో అన్ని వ్యాపార లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ.. మటం వెంకట రావుకు హైదరాబాద్ రీజియన్ హృదయపూర్వక స్వాగతం తెలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్-కోఠిలో ఉన్న రిజినల్ ఆఫీస్లో సిబ్బంది 'పరెవర్ సెంట్రలైట్'' అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ రీజినల్ మేనేజర్ డిఎస్.రాథౌర్ సహా ప్రాంతీయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాథౌర్ మాట్లాడుతూ.. సిబ్బంది అందరూ వ్యాపార అభివృద్ధి, ఎస్ఎంఏ, ఎన్పీఏ రికవరీలపై దృష్టి సారించాలన్నారు. ఇందులో చురుగ్గా పాల్గొన్న హైదరాబాద్ రీజియన్ స్టాఫ్కు కృతజ్ఞతలు తెలిపారు.