Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసీని ప్రశ్నించిన హైకోర్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాల జరుగుతుంటే అధికారులు అడ్డుకునే చర్యలు ఎందుకు చేపట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆదిలోనే అడ్డుకుంటే అక్రమ నిర్మాణాలకు ఆస్కారం ఉండదనీ, జోన్ల స్థాయి అధికారులను కట్టడి చేస్తే సర్కిల్స్ స్థాయిలో చర్యలు ఉంటాయని అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కూకట్పల్లి ప్రాంతంలో నిర్మాణం చేసిన తన భవనాన్ని కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని గొట్టిముక్కల నాగేశ్వరరావు దాఖలు చేసిన రిట్ను గురువారం వ్యాజ్యాలు దాఖలు చేశారు. తమ భవనాన్ని కూల్చేస్తామని జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసు అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలనే రిట్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అను మతి తీసుకుని 5 అంతస్తులను పిటిషనర్ నిర్మించడంపై హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై ఉదాశీనత వద్దని, వాటి నిగ్గు తేల్చాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.