Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19 వ్యాక్సినేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ను శుక్రవారం నుంచి జిల్లా, ఏరియా ఆస్పత్రులతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వేయనున్నారు. లబ్దిదారులు అంటే 60 ఏండ్లు పైబడిన వారందరూ, 45 ఏండ్లుపైన వయస్సు కలిగి ఇతర వ్యాధులున్న వారు ఆన్లైన్లో ముందస్తు రిజిస్ట్రేషన్ లేదా ఆయా కేంద్రాల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ తీసుకునే వీలు కల్పించారు. కాగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ నాలుగో రోజూ గురువారం కొనసాగింది. 333 ఆస్పత్రుల్లో 26,513 మంది కోవిడ్-19 వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. వీరిలో 60 ఏండ్ల పైబడిన వారితో పాటు 45 ఏండ్లకు పైగా వయస్సు కలిగి ఇతర వ్యాధులున్న వారు 21,207 మంది, వైద్యారోగ్య సిబ్బంది 917 మంది, ఫ్రంట్లైన్ వర్కర్లు 536 మంది మొదటి డోసు వేయించుకున్నారు. 3452 మంది వైద్యారోగ్య సిబ్బందికీ, తొమ్మిది మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు రెండో డోసు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారు 3,24,546, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 1,53,366కు చేరారు. తాజాగా 171 ప్రభుత్వాస్పత్రుల్లో 9378 మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం పెట్టుకోగా 8986 మంది (96 శాతం), 162 ప్రయివేటు ఆస్పత్రుల్లో 13,274 మందికిగానూ 12,221 (92 శాతం) మందికి ఇచ్చారు.