Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వేగంగా క్లియర్ అయ్యేలా రెండు నెలలుగా సేవలందిస్తున్న ఆ శాఖ సిబ్బందిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అభినందించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గురువారం కలిశారు. రిజిస్ట్రేషన్ శాఖలోని అన్ని స్థాయిలలో అతి తక్కువ సమయంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్కు, సీఎస్ సోమేశ్కుమార్కు కృతజ్ఞతలు చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ నెలలోని రెండో శనివా రంతో పాటు ఆదివారాల్లోనూ రిజిష్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. అయితే, మార్చి 11(శివ రాత్రి), మార్చి13(హోలి) రోజుల్లో మాత్రం పనిచేయబోవని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోగలరని కోరారు. సీఎస్ను కలిసినవారిలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమిషనర్, ఐజీ శేషాద్రి, అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ, కన్వీనర్, టీఎన్జీఓ హైదరాబాద్ నగర అధ్యక్షులు ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు ప్రణరు కుమార్, సిరాజ్, అన్వర్, నరేష్ గౌడ్, పాల్గొన్నారు.