Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని విషయాల్లోనూ తెలంగాణకు అన్యాయం చేయటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ప్రకటిచటం పట్ల ఆయన ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు మోడీ సర్కార్ ఈ మేరకు తమకు సమాచారం ఇచ్చిం దని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం 150 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని వివరించారు. అయితే గతంలో ఐటీఐఆర్ మాదిరిగానే ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీకి కూడా బీజేపీ మంగళం పాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.