Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో బీజేపీ నిరంకుశత్వం..రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకత్వం వల్ల రోజూ,రోజుకు ఆ పార్టీల గ్రాఫ్ పడిపోతున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలిసిన విలేకర్లతో ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఐటీఐఆర్కు నాడు కాంగ్రెస్ అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఏడేండ్లు గడిచినా ఐటీఐఆర్పై టీఆర్ఎస్ కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.