Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్-థోరాసిక్ సర్జన్స్ (ఐఏసీటీఎస్) 67వ వార్షిక సదస్సు జూనియర్ వైస్ ప్రెసిడెంట్గా 'డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సీనియర్ కార్డియోథోరాసిక్ (సీటీ) సర్జన్, స్టార్ హాస్పిటల్స్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా' ఎంపికయ్యారు. సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన డాక్టర్ సజ్జా ఇటీవల 'ప్రమోట్ పాటెన్సీ ట్రయల్' అనే అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఇది ఇండియన్ జర్నల్ ఆఫ్ థోరాసిక్ కార్డియోవాస్క్యులర్ సర్జరీలో ప్రచురించబడింది. దేశంలో జరుగుతున్న క్లినికల్ వర్క్స్ అకడమిక్, సైంటిఫిక్ వాలిడేషన్లో పాటెన్సీ ట్రయల్ ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది అని ఓ ప్రకటనలో పేర్కొంది.