Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్తో కేంద్ర హౌసింగ్ సెక్రెటరీ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్, ఆత్మనిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్, అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ పథకాల అమలు, పురోగతి పట్ల కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రెటరీ దుర్గాశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్తో ఆయన భేటీ అయ్యారు. అమత్, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం స్వనిధి, హౌసింగ్ ఫర్ ఆల్ లాంటి పథకాలు అమలు తీరు బాగుందని ప్రశించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అర్బన్ పథకాల అమలుపై సీనియర్ మున్సిపల్ అధికారులు వివరణాత్మకంగా ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కేంద్ర కార్యదర్శి లక్డికాపుల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించడంతోపాటు, ఫతుల్లాగూడలోని జంతు సంరక్షణ కేంద్రం, వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు, భవనాల, హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కేంద్ర జాయింట్ సెక్రటరీ సంజరు, హైదరాబాద్ మెట్రో వాటర్వర్క్ృ ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, అదనపు కమిషనర్ శంకరయ్య, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్విఎస్రెడ్డి, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వల్లురి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.