Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న అధికారుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని రూపొందించినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థలు సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండే ఈ పథకానికి సింగరేణి ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కాంట్రీబ్యూషన్ పింఛన్ స్కీం (ఈడీసీపీఎస్)గా నామకరణం చేశారు. దీనికోసం ప్రత్యేక ట్రస్ట్ను ఏర్పాటు చేసినట్టు ట్రస్ట్ చైర్మెన్, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్ బలరాం తెలిపారు. తొలివిడతలో స్కీం ద్వారా 389 మంది రిటైర్డ్ అధికారులకు లబ్ది చేకూరుతుందనీ, దానికోసం ఎల్ఐసీలో రూ.19.5 కోట్లు జమచేసినట్టు వివరించారు. రిటైర్డ్ అధికారి అనంతరం ఆయన నామినీకి కూడా ఆర్థిక ప్రయోజనాలు ఈ స్కీం ద్వారా వర్తిస్తాయని తెలిపారు.
ఇల్లెందు సోలార్ అనుసంధానం
సింగరేణి కాలరీస్ ఇల్లెందులో నిర్మించిన 39 మెగావాట్ల సోలార్ విద్యుత్ను శనివారం టీఎస్ట్రాన్స్కో సబ్స్టేషన్కు అనుసంధానం చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, డి సత్యనారాయణ తెలిపారు. సింగరేణిలో మొత్తం 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ప్లాంట్లను నెలకొల్పుతున్నట్టు వారు తెలిపారు.