Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అందులోని హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. అదే జరిగితే దేశం వందేండ్లు వెనక్కి పోతుందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో గెట్ టూ గెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థలను తొలగించి, వాటిని ప్రయివేటుపరం చేసేందుకు ఏకంగా ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసిన ఘనత.. బీజేపీకే దక్కుతుందని విమర్శించారు. ఆయా సంస్థలు లేకపోతే రిజర్వేషన్లు, సంబంధిత హక్కులే ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలు, దాని విధానాలపై ఆలోచించాలని సూచించారు. బీజేపీ నేతల రెచ్చగొట్టుడు ప్రసంగాలకు, ప్రకటనలకు మోసపోవద్దని యువతకు సూచించారు. ఆ పార్టీ చెప్పే మాయ మాటలకు లొంగపోవద్దని హితవు పలికారు.