Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, వర్కర్లపై వేధింపులు ఆపేలా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అంగన్ వాడీ వర్కర్స్(టీచర్స్), హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న నాలుగు మండలాలు మెదక్, హవేళీ ఘన్పూర్, పాప న్నపేట, కొల్చారం మండలాల్లో టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ల దగ్గర నుంచి సంబంధిత ప్రాజెక్టు అధికారి గత డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ.1000 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పని చేయకుండా జీతాలు తీసుకున్నారనీ, రూ.1000 ఇచ్చిన వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఇవ్వని వారు సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీ చేయాలని భయపెడుతున్నారని తెలిపారు.