Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలో యువకుడి ఆత్మహత్య
నవతెలంగాణ-కోట్పల్లి
ఉన్నత చదవులు చదివి, ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని మానసిక ఒత్తిడికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ గ్రామానికి చెందిన బిచ్చన కుమారుడు నరేశ్(25) ఉన్నత చదువు చదివి ఎన్నో పోటీ పరీక్షలు రాశాడు. అయిని ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దాంతో తమ పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది బెంగుళూరుకు ఉద్యోగ నిమిత్తం వెళ్లి, రెండు వారాల కిందటే గ్రామానికి వచ్చాడు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిం చారు. మృతుడి తల్లి పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు.