Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు నోటాకు ఓటు వేసేందుకు ఓటర్లకు అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 2013 నుంచి దేశంలో నోటా అమల్లోకి వచ్చింది. తొలిసారిగా 2013లో జరిగిన ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు అవకాశం లేకపోవడం గమనార్హం. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాను పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో నోటా ఉండదు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల పేర్లు, సీరియల్ నెంబర్, రాజకీయ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థి అని మాత్రమే బ్యాలెట్ పత్రంలో ముద్రిస్తారు.