Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ప్రకటించిన హెచ్ఏఎల్ కార్మికులు
నవతెలంగాణ-బాలానగర్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ను గెలిపించుకుందామని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కార్మికులు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని హెచ్ఏఎల్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పబ్లిక్ సెక్టార్ పూర్వ నాయకులు రాఘవ రావు, బీఎం సుదర్శన్ పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగేశ్వర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే గొంతులను శాసన మండలికి పంపించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపించే నాగేశ్వర్ను గెలిపించుకోవాలని అందరూ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకోసం తాము కట్టుబడి ఉన్నామనీ, అందుకు నాగేశ్వర్ను గెలిపించుకుంటామని హెచ్ఏఎల్ కార్మికులు తెలిపారు. సమావేశంలో హెచ్ఏడబ్ల్యుయూ అధ్యక్ష, కార్యదర్శులు విజయ ప్రసాద్, వెంకటాద్రి, నాయకులు రాంచందర్, సురేష్, సత్యనారాయణ, సూర్యప్రకాష్ నాగార్జున, టీం నాగేశ్వర్ సభ్యులు ఐలాపురం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.