Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలతో పాటు పెద్దలకూ..
- స్వచ్ఛబడిని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఇకనుంచి చెత్త నిర్వహణపై క్లాసులు
నవతెలంగాణ-సిద్దిపేట
చెత్త నిర్వహణపై పాఠాలు నేర్పించేందుకే స్వచ్ఛ బడిని ఏర్పాటుచేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణలో ప్రప్రథమంగా నిర్మిం చిన ఈ స్వచ్ఛబడిని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో ఆదివారం మంత్రి ప్రారంభించి మాట్లా డారు. చెత్తను సరైన విధంగా డిస్పోజ్ చేయకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పేందుకే ఈ స్వచ్ఛ బడి అన్నారు. చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో ఇండ్ల లోనే ఎరువుల తయారీపై ఈ పాఠశాలలో విద్యార్థు లతో పాటు పెద్దలకూ అవగాహన కల్పించనున్నారు. సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలో రోజుకు 40 టన్నుల చెత్త వస్తుందనీ, దాంతో పట్టణ ప్రజల ఆరోగ్యం పాడవుతుందని ఆలోచించి మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ఈ బడిని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛబడి సిద్దిపేటలో ప్రారంభించి, ఒక కొత్త ఒరవడిని అందించిన డాక్టర్ శాంతికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ స్వచ్ఛ బడికి వచ్చి చెత్తను ఎలా ఎరువులుగా మార్చుకోవాలో నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. 12, 13, 14 తేదీల్లో లేక్ ఫెస్టివల్ ఉత్సవాలను కోమటి చెరువుపై చేపడుతున్నట్టు చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి గ్లో గార్డెన్తో పాటు రెండవ మ్యూజికల్ ఫౌంటెన్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త డాక్టర్ శాంతి, చైర్మెన్ రాజ నర్సు, కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు దీప్తి నాగరాజ్, గ్యాదరి రవి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.